
బెల్లంపల్లి రూరల్, వెలుగు: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సూచించారు. వన మహోత్సవంలో భాగంగా కన్నెపల్లి మండలంలోని చర్లపల్లి ప్రైమరీ స్కూల్, భీమిని మండలంలోని జడ్పీ స్కూల్లో వన ఎమ్మెల్యే వినోద్ స్థానిక నాయకులతో కలిసి మొక్కలను నాటారు. జగ్గయ్యపేటలో ఎండోమెంట్ కింద నిర్మించిన శివకేశవ ఆలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మండల ప్రజల సౌకర్యం కోసం మంచిర్యాల నుంచి భీమిని మండల కేంద్రానికి నడిచే ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. బెల్లంపల్లి మార్కెట్కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింగరావు, డీఆర్డీవో పీడీ కిషన్, ఎంపీడీవో గంగామోహన్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.