క్యాప్ స్కాలర్ షిప్ పోటీలకు రిత్విక్ ఎంపిక

క్యాప్ స్కాలర్ షిప్ పోటీలకు రిత్విక్ ఎంపిక

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని అశోక్ నగర్​కు చెందిన అండర్ 14 క్రికెటర్‌ రిత్విక్‌ రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. మహారాష్ట్రలోని పుణెలో ఉన్న క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్(క్యాప్) నిర్వహిస్తున్న స్కాలర్‌షిప్ పోటీలకు రిత్విక్ ఎంపికయ్యాడు. రిత్విక్ ప్రస్తుతం స్థానిక 

శ్రీ చైతన్య స్కూల్​లో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ సందర్భంగా రిత్విక్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ పోటీలకు తాను ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని, ఆ తర్వాత రూ.2 లక్షల స్కాలర్‌ షిప్ పొందే అవకాశం ఉందని తెలిపాడు.