కాంగ్రెస్ పార్టీకి ఆదరణ చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు: గడ్డం వినోద్

కాంగ్రెస్ పార్టీకి ఆదరణ చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు: గడ్డం వినోద్

మంచిర్యాల:ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ ఎస్ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ ఆరోపించారు. బెల్లంపల్లి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య, అతని అనుచరుల ఆగడాలు ఎక్కువయ్యాయని.. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని.. అది చూసి ఓర్వలేక దుర్గం చిన్నయ్య, అతని అనుచరులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియా మార్ఫింగ్ చేస్తూ .. అబద్దపు ప్రచారం చేస్తున్నారని దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని.. పరువు నష్టం దావా వేస్తామని గడ్డం వినోద్ హెచ్చరించారు. డిసెంబర్ 3న దుర్గం చిన్నయ్యకు బెల్లంపల్లి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ అన్నారు.