ముంబై: బెంచ్మార్క్ ఇండెక్స్ నిఫ్టీ బుధవారం 22,100 పైన క్లోజయ్యింది. బ్యాంకింగ్, ఆటో, ఆయిల్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో నిఫ్టీ 119 పాయింట్లు (0.54 శాతం) లాభపడి 22,124 దగ్గర సెటిలయ్యింది. సెన్సెక్స్ 526 పాయింట్లు పెరిగి 72,996 దగ్గర ముగిసింది. సెన్సెక్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లయితే ఇంట్రాడేలో 4 శాతం వరకు ర్యాలీ చేశాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 20 లక్షల కోట్లు దాటింది. చివరికి 3.60 శాతం లాభంతో రూ.2,988 దగ్గర సెటిలయ్యింది. ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేస్తుందనే వార్తలతో మారుతి షేర్లు బుధవారం 4 శాతం పెరిగి రూ.12,724 లెవెల్ను టచ్ చేశాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4 లక్షల కోట్ల మార్క్ను దాటింది
విప్రో, హెచ్సీఎల్ టెక్, నెస్లే, టీసీఎస్, టాటా మోటార్స్ షేర్లు బుధవారం నష్టపోయాయి. గురువారం విడుదలయ్యే యూఎస్ జీడీపీ డేటాపైన, వచ్చే వారం విడుదలయ్యే ఆర్బీఐ పాలసీపైన ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టారని ఎనలిస్టులు పేర్కొన్నారు. మార్కెట్ డైరెక్షన్ను ఇవి నిర్ణయిస్తాయని అన్నారు. స్మాల్క్యాప్, మిడ్క్యాప్ ఇండెక్స్లు పాజిటివ్గా క్లోజయ్యాయి.