సెన్సెక్స్  మార్కెట్లకు కొద్దిపాటి నష్టాలు

 సెన్సెక్స్   మార్కెట్లకు కొద్దిపాటి నష్టాలు

ముంబై: బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ సెన్సెక్స్ మంగళవారం 195 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ  22,400 స్థాయికి దిగజారింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీనత సంకేతాలు, విదేశీ నిధుల ప్రవాహాల వల్ల మార్కెట్లు నష్టపోయాయి. ఐటీ,  ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ షేర్లలోనూ నష్టాలు కనిపించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్​ 460.04 పాయింట్లు తగ్గి 73,412.25 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 49.30 పాయింట్లు క్షీణించి 22,356.30 వద్ద ముగిసింది.

సెన్సెక్స్,  నిఫ్టీలు నాలుగు రోజుల ర్యాలీ తర్వాత సోమవారం జీవితకాల గరిష్ట స్థాయిలలో ముగిశాయి. దీంతో సూచీలు దాదాపు 2 శాతం పెరిగాయి.  సెన్సెక్స్ సంస్థలలో బజాజ్ ఫిన్‌‌‌‌‌‌‌‌సర్వ్  బజాజ్ ఫైనాన్స్ ఒక్కొక్కటి 4 శాతానికి పైగా పడిపోయాయి. నెస్లే, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ టెక్నాలజీస్, లార్సెన్ అండ్​ టూబ్రో  హిందుస్థాన్ యూనిలీవర్ వెనుకబడి ఉన్నాయి.