- సెంట్రల్ దళాలు ఢిల్లీ చెప్పినట్టు చేస్తున్నయ్..
- హుగ్లీ జిల్లా ఎలక్షన్ మీటింగ్లో మమతా బెనర్జీ
బాలాగఢ్: సెంట్రల్ పారామిలిటరీ దళాలపై వెస్ట్ బెంగాల్సీఎం మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. వారు గ్రామాలను సందర్శించి ప్రజలను బెదిరించే అవకాశం ఉందని, ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని కోరారు. గురువారం హుగ్లీ జిల్లాలో ఆమె ఎలక్షన్మీటింగ్లో మట్లాడారు. బెంగాల్.. మరో గుజరాత్ కావాలని కోరుకుంటున్నారా? అని ఓటర్లను మమత ప్రశ్నించారు. బీజేపీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని చెప్పారు. మన పండుగ దుర్గ పూజను రక్షించుకోవాలంటే బీజేపీని ఓడించాలన్నారు. సెంట్రల్దళాలకు భయపడొద్దన్నారు. మిమ్మల్ని సెంట్రల్దళాలు వేధిస్తే లోకల్పోలీస్స్టేషన్లో కంప్లైంట్ఇవ్వాలని, ఒకవేళ వారు కేసు నమోదు చేసుకోకపోతే తమకు ఇన్ఫాం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘నేను సెంట్రల్పారామిలిటరీ దళాలను గౌరవిస్తాను. కానీ వీరు సెంట్రల్ హోం మినిస్టర్అమిత్షా ఆదేశానుసారం పనిచేస్తున్నారు. పోలింగ్ముందు రోజు వారు గ్రామాల్లో పర్యటించి ప్రజలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో కొందరు మహిళలను కూడా వేధిస్తున్నారు. బీజేపీకి ఓటు వేయమని అడుగుతున్నారు’అని మమత ఆరోపించారు. రాష్ట్ర పోలీసులు సెంట్రల్దళాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘మీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ ముందు తాకట్టు పెట్టొద్దు’ అని పోలీసులను కోరారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. పోలింగ్బూత్కు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ ఉంటుందని, అయితే నియోజకవర్గం మొత్తం144 సెక్షన్ ఉన్నట్లు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమ ఒటర్లు పోలింగ్సెంటర్లకు వెళ్లకుండా వారు ఇలా చేస్తున్నారని చెప్పారు.