సైంటిస్ట్ పై బెంగళూరులో కత్తులతో దాడి.. కారు ధ్వంసం

సైంటిస్ట్ పై బెంగళూరులో కత్తులతో దాడి.. కారు ధ్వంసం

బెంగళూరులో దారుణం జరిగింది. ఓ సైంటిస్టును కొంత మంది లోకల్ గుండాలు కత్తులతో వెంబడించి దాడి చేశారు.  అతని కారును ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని బాధితుడు  ట్విట్టర్లో షేర్ చేయడంతో విషయం బయటకు తెలిసింది.  పోలీసులు ఈ ఘటనపై  చర్యలు తీసుకోవాలని కోరారు. 

సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మేటర్ సైన్సెస్ (సిఇఎన్‌ఎస్)కి అనుబంధంగా పనిచేస్తున్న శాస్త్రవేత్త అశుతోష్ సింగ్  ఆగస్టు 24న   బెంగళూరులోని రౌతనహళ్లి రోడ్‌ లో  అర్ధరాత్రి 12:45 గంటలకు కారులో వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు  కత్తులతో అతని కారును ఆపేందకు ప్రయత్నించారు.  ఆపకపోవడంతో దుండగులు కత్తులతో  కొంత దూరం కారును వెంబడించారు.  ఆయన కారు అద్దాలను పగలగొట్టారు. ఎలాగో అలా తప్పించుకున్న సైంటిస్టు   మదనాయకనహళ్లి పీఎస్‌లో   ఫిర్యాదు చేశారు. అయితే వారు ఇంతవరకు సరిగా స్పందించకపోవడంతో అశుతోష్ ట్విట్టర్లో షేర్ చేశారు. 

 మదనాయకనల్లి పోలీసులు నలుగురు గుర్తుతెలియని దుండగులపై క్రిమినల్ బెదిరింపు, అక్రమ నిర్బంధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏడీజీపీ అలోక్ కుమార్  హామీ ఇచ్చారు.