పెంపుడు కుక్క చనిపోయిందని డిగ్రీ స్టూడెంట్ ​సూసైడ్

పెంపుడు కుక్క చనిపోయిందని డిగ్రీ స్టూడెంట్ ​సూసైడ్

అల్వాల్, వెలుగు: తాను ఎంతో ఇష్టపడి పెంచుకుంటున్న కుక్క చనిపోయిందనే మనస్థాపంతో ఓ డిగ్రీ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. అల్వాల్​ పీఎస్ ​పరిధిలో  ఈ ఘటన జరిగింది. అల్వాల్​ రిట్రీట్​ కాలనీలో ఉండే నారాయణ హోటల్ మేనేజ్ మెంట్ కాలేజీ చైర్మన్ లక్ష్మీనారాయణకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు విష్ణు నారాయణ(20) పంజాగుట్టలోని ఓ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. విష్ణు పెంచుకుంటున్న కుక్క 3 నెలల కిందట మృతి చెందింది. అప్పటి నుంచి విష్ణు మనస్థాపంతో ఉంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి ఇంట్లో గదిలోకి వెళ్లి డోర్​వేసుకుని ఫ్యాన్​కు ఉరేసుకున్నాడు. 
కుటుంబసభ్యులు మంగళవారం ఉదయం అతడి రూమ్ డోర్ తెరిచి లోపలికి వెళ్లి చూడగా విష్ణు ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించాడు. పెంపుడు కుక్క చనిపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు. విష్ణు రాసిన సూసైడ్ నోట్​ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.