ఉపాధి హామీలో కూలీల సంఖ్యను పెంచాలి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

ఉపాధి హామీలో కూలీల సంఖ్యను పెంచాలి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఉపాధి పనుల్లో కూలీల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ అంకిత్​ ఆదేశించారు. కలెక్టరేట్​లో బుధవారం పలు శాఖల ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా వేకువజామున 5 గంటలకే కూలీలు పని ప్రదేశాలకు చేరుకునేలా చూడాలన్నారు. 

ఉపాధి హామీ నిధులతో చేపట్టిన అంగన్​వాడీ బిల్డింగ్​లు, టాయ్​లెట్స్, మహిళా సంఘాల భవనాల పనులు స్పీడప్​​చేయాలన్నారు. దివ్యాంగుల సదరం కేంద్రాల్లో సౌండ్​ ప్రూఫ్​ పరికరాలు, ఆధునిక వైద్య పరికరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్డీవో విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, పీఆర్​ఈఈ శ్రీనివాస్  పాల్గొన్నారు.