పల్లెల్లో పర్యాటక అభివృద్ధితో ఆర్థిక ప్రగతి : కలెక్టర్ జితేశ్

 పల్లెల్లో పర్యాటక అభివృద్ధితో ఆర్థిక ప్రగతి :  కలెక్టర్ జితేశ్
  • భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ​జితేశ్​​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పర్యాటక అభివృద్ధితో పల్లెలు ఆర్థిక ప్రగతి సాధిస్తాయని కలెక్టర్​జితేశ్​వి పాటిల్​తెలిపారు. డాక్టర్​ మన్మోహన్​ సింగ్​ ఎర్త్​ సైన్సెస్​ యూనివర్సిటీలో సోమవారం సర్పంచులకు నిర్వహించిన శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడతలో జిల్లాలోని 14 మండలాల్లోని సర్పంచులకు శిక్షణ కొనసాగుతోందని తెలిపారు. పల్లెల అభివృద్ధిలో సర్పంచులదే కీలకభూమిక అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామపంచాయతీలకు వచ్చే ఫండ్స్​ను సరిగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాల్లో మంచినీటి ఎద్దడి లేకుండా ప్రణాళికలను రూపొందించాలన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. అంగన్​వాడీ కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలను పరిశీలించాలన్నారు. గ్రామపంచాయతీలో జరిగే ప్రతి పని విషయంలో ఆయా శాఖలను సమన్వయం చేసుకుంటూ గ్రామాలను అభివృద్ధి బాటలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్​ విద్యాచందన, జడ్పీ సీఈఓ బి. నాగలక్ష్మి, డీపీఓ సుధీర్, అధికారులు అనూష, ప్రభాకర్, సుభాష్​ చంద్ర గౌడ్, రవీందర్, సునీల్​ కుమార్, ముత్యాల రావు పాల్గొన్నారు.