వైభవంగా రామయ్య పట్టాభిషేక మహోత్సవం

వైభవంగా రామయ్య పట్టాభిషేక మహోత్సవం

భద్రాద్రిలో కల్యాణ రాముడి పట్టాభిషేకం వైభవంగా జరిగింది. సీతా సమేత శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్వహించారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు గవర్నర్ దంపతులు. అయితే ముందుగా కలశాలు, ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడికి అష్టోత్తర శతనామార్చన చేశారు.

పట్టాభిషేక మహోత్సవంలో భాగంగా...పాదుకలను శ్రీరాముడికి సమర్పించారు ఆలయ పూజారులు. రాజదండం, రాజ ముద్రిక, రాజ ఖడ్గం, ఛత్రం, చామరలు, రామదాసు పచ్చల పతకం ఇలా ఒక్కోటిగా శ్రీరాముడికి అలంకరించారు. తర్వాత వైభవంగా రామచంద్రునికి కిరీటధారణ చేశారు. చివరగా వివిధ నదుల తీర్థాలతో సీతా లక్ష్మణ సమేత శ్రీరాముల వారికి అభిషేకం నిర్వహించారు.

మరిన్ని వార్తల కోసం..

వడ్ల కొనుగోళ్లపై రేపటి కేబినెట్ భేటీలో నిర్ణయం!

బరిలోకి కేజీఎఫ్.. తప్పుకున్న హిందీ మూవీ

కంప్లైంట్ ఇచ్చిన సారే.. బ్రిడ్జి దొంగ