
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని పాఠశాలల్లో భగవద్గీత ఓ సబ్జెక్టుగా ఉండబోతుంది. 6 నుంచి 12వ తరగతి వరకు ‘గీత’ను కంపల్సరీ బోధనాంశంగా చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఇది వర్తిస్తుందని గుజరాత్ విద్యాశాఖ మంత్రి జితు వాఘాని తెలిపారు. విద్యార్థుల్లో మానవతా విలువలను పెంపొందించేందుకు, వారిని సన్మార్గంలో నడిపించేందుకు భగవద్గీత ఎంతో దోహదపడుతుందని మంత్రి అన్నారు.