సత్యం పలకాలి..సాయం చేయాలి

సత్యం పలకాలి..సాయం చేయాలి

యాదాద్రి భువనగిరి జిల్లా: సత్యం పలకుతూ తోచిన సాయం చేసినప్పుడే సత్యసాయిబాబకు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు ప్రముఖ కవి, రచియిత డాక్టర్ కస్తూరి లక్ష్మీనారాయణ. సోమవారం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు బాబా భక్తులు. శ్రీ సత్య సాయి సేవా భజన మండలి వారి ఆధ్వర్యంలో నారాయణ సేవా  మరియు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట సమీపంలోని సహృదయ అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్.కస్తూరి లక్ష్మీనారాయణ..ప్రతి ఒక్కరూ సత్యసాయి బాబా పేరుతో సేవా కార్యక్రమాలు చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో సాహీతీ వేత్తలు సోమ సీతారాములు, సోమ కృష్ణమూర్తి సరస్వతి, సోకం వేమనకృష్ణ, బాలరాజు, పస్పునురి నాగభూషణం వాణి, నంగునురి విజయ్ కూమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వృద్ధాశ్రమంలో డాక్టర్ కస్తూరి లక్ష్మీనారాయణ వృద్ధులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.