
- ముగ్గురు వేటగాళ్లు అరెస్ట్
కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దుర్గారం గ్రామంలో వన్యప్రాణి(కనుజు) మాంసాన్ని ఫారెస్ట్ ఆఫీసర్లు స్వాధీనం చేసుకొని, ముగ్గురు వేటగాళ్లను అరెస్ట్ చేశారు. ఎఫ్ఆర్వో వజహత్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి దుర్గారంలో కనుజును వేటాడి మాంసం పోగులు వేసుకున్నట్లు సమాచారం అందిందని తెలిపారు.
వెంటనే ఎఫ్ఎస్ వో రాజేశ్, ఎఫ్ బీవోరాకేశ్, సిబ్బందిని పంపి గ్రామంలో సోదాలు నిర్వహించగా, సుధాకర్, నర్సింహ, ఉపేందర్ ఇండ్లల్లో వండిన మాంసం లభించిందని చెప్పారు. ఉచ్చులు వేసి కనుజును వేటాడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ముగ్గురిపై వన్యప్రాణి చట్టం ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఉచ్చులు, వండిన మాంసం సీజ్ చేసినట్లు చెప్పారు.