భారత్ బయోటెక్ వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్

భారత్ బయోటెక్ వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందు వరుసలో ఉంది. ఇతర దేశాలతో పోటీ పడుతూ మరీ పని చేస్తోంది. కోవాక్సిన్ అనే కరోనా వ్యాక్సిన్ ని అభివృద్ధి చేయడానికి… ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సహకారంతో ముందుకు వెళ్తోంది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్… ఇప్పుడు మరో కీలక దశలోకి ప్రవేశించింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి లభించింది.

ట్రయల్స్ నిర్వహించడానికి వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ కి అనుమతి ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) యొక్క సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ సిఫార్సు చేసింది. భారత్ బయోటెక్ అక్టోబర్ 2 న DCGI కి దరఖాస్తు చేస్తూ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. మొదటి, రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్ జంతువులలో పరీక్షించిన స్టడీ తర్వాత ఆ డేటాను అంచనా వేసి తర్వాత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో) ప్యానెల్ అనుమతి ఇవ్వాలని సిఫారసు చేసింది.

18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 28,500 మందిని ఈ అధ్యయనం కవర్ చేసింది. 10 రాష్ట్రాలలో అంటే… దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, పాట్నా, లక్నోతో సహా 19 ప్రదేశాల్లో ఈ వ్యాక్సిన్ కి సంబంధించి ట్రయల్స్ నిర్వహిస్తున్నామని భారత్ బయోటెక్ తెలిపింది.