బీజేపీ ద్వేషాన్ని నమ్ముకుంటే.. మేం ప్రేమను పంచుతున్నం: రాహుల్ గాంధీ

బీజేపీ ద్వేషాన్ని నమ్ముకుంటే.. మేం ప్రేమను పంచుతున్నం: రాహుల్ గాంధీ

పాట్నా: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర  బీహార్ లోని ప్రవేశించింది. అక్కడ రాహుల్ గాంధీకి కాంగ్రెస్​పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘దేశాన్ని విడదీసేందుకు బీజేపీ,​ఆర్ఎస్ఎస్​ద్వేషాన్ని వ్యాప్తిచేస్తుంటే.. తాము ప్రేమను పంచుతున్నం.

మణిపూర్​లో ఇప్పటికీ హింస చెలరేగుతోంది. కానీ ఇప్పటివరకు ప్రధాని మోదీ అక్కడికి ఎందుకు వెళ్లడం లేదు? ఎన్డీయేపాలనలో ప్రజలకు న్యాయం జరగడంలేదు. బడా వ్యాపారులకు మేలు. దేశంలో ఆర్థిక, సామాజిక న్యాయం పునరుద్ధరించాలి. మణిపూర్​హింసకు ప్రధానిదే బాధ్యత’ అని అన్నారు.