- రైతులకు భారతీయ కిసాన్ సంఘ్ పిలుపు
హైదరాబాద్, వెలుగు : ధరణి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దశలవారీగా ఉద్యమించాలని రైతులకు భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్ ) పిలుపునిచ్చింది. బుధవారం బీకేఎస్ తెలంగాణ రెవెన్యూ ఆయామ్ (ధరణి) ప్రముఖ్ బండి కృష్ణారెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లో వివిధ జిల్లాల రెవెన్యూ ఆయామ్ ప్రముఖులు సమావేశమయ్యారు.
దీనికి రాష్ట్ర అధ్యక్షుడు జోగినపల్లి రంగారావు, చీఫ్ గెస్ట్ గా రిటైర్డ్ తహసీల్దార్ చంద్రసేన రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.