న్యూఢిల్లీ: భారతదేశపు రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన భారతీ ఎయిర్టెల్కు ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండవ క్వార్టర్లో రూ.2,145 కోట్ల లాభం వచ్చింది. ఏడాది క్రితం ప్రకటించిన రూ. 1,134 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 89 శాతం పెరిగింది. డేటా ట్రాఫిక్లో బలమైన వృద్ధి కనిపించింది. ఎనలిస్టుల అంచనాల ప్రకారమే లాభం వచ్చింది.
రిపోర్టింగ్ క్వార్టర్లో మొత్తం ఆదాయం రూ. 34,526.8 కోట్లుగా ఉంది, పోయిన ఏడాది ఇదే క్వార్టర్లో నమోదైన రూ. 28,326.4 కోట్లతో పోలిస్తే ఇది 22 శాతం ఎక్కువ. నికర లాభంలో సంవత్సరానికి 75 నుంచి 110 శాతం వరకు గ్రోత్ ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేశారు. అయితే ఆదాయ వృద్ధి 20 శాతమే ఉంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 16 దేశాలలో వాయిస్ ట్రాఫిక్ 5.1 శాతం పెరిగింది.