నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సేవలకు..ఎయిర్ టెల్ రూ.20వేలకోట్ల పెట్టుబడి

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సేవలకు..ఎయిర్ టెల్ రూ.20వేలకోట్ల పెట్టుబడి
  • ఎన్​బీఎఫ్​సీ విస్తరణకు రూ.20 వేల కోట్లు..
  • ఎయిర్​టెల్ ​ప్రకటన

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ తన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ మనీ విస్తరణకు భారీ ప్రణాళికలు ప్రకటించింది. రాబోయే కొన్నేళ్లలో ఈ అనుబంధ సంస్థకు రూ.20 వేల కోట్ల మూలధనాన్ని సమకూర్చనున్నట్లు వెల్లడించింది. ఇందులో ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ 70 శాతం వాటా అందించగా, మిగిలిన 30 శాతం మొత్తాన్ని భారతీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ సమకూరుస్తుంది. 

ఈనెల 13న ఆర్​బీఐ నుంచి ఎన్​బీఎఫ్​సీ లైసెన్స్ పొందినట్లు సంస్థ తెలిపింది. దేశంలో రుణ  అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో డిజిటల్ ఆర్థిక సేవలను వేగంగా విస్తరించాలని ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ భావిస్తోంది. ఇప్పటికే ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ తన లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఎల్​ఎస్​పీ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ ద్వారా రూ.తొమ్మిది వేల కోట్ల విలువైన లోన్లను ఇచ్చినట్టు తెలిపింది.