తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో నెల రోజులు పూర్తి చేసుకోవడం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు. ప్రజల కలలు నిజం చేయడమే ఇందిరమ్మ ప్రజా పాలన లక్ష్యమని తెలిపారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో విర్ర వీగకుండా వెన్నులో భయం పెట్టుకొని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు సేవకుడిగా పని చేసి అప్పుల రాష్ట్రాన్ని గట్టెక్కిస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, అప్పుల ఊబిలోకి నెట్టినప్పటికీ ఉద్యోగులకు రెండవ తారీఖున జీతాలు ఇచ్చిన ప్రభుత్వం తమదని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అప్పుల పాలైనప్పటికీ ప్రజల కలలు నిజం చేయడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చిన వాటిని అధిగమించి సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని చెప్పారు.
ప్రజలకు సేవకుడిగా పని చేస్తా..
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) January 7, 2024
అప్పుల రాష్ట్రాన్ని గట్టేక్కిస్తాం..
విద్యుత్ ఉత్పత్తి పెంచి వెలుగులు పంచుతా..
తెలంగాణ ప్రజల కలలు నిజం చేయడమే ఇందిరమ్మ ప్రజా పాలన లక్ష్యం..
తెలంగాణ అంటే నాకు ప్రాణం
తెలంగాణ అభివృద్ధికి నిరంతరం పని చేస్తా..
తెలంగాణ ప్రజలు తలెత్తుకునేలా పాలన…
నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది : రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందన్నారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తున్నామన్నారు. నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చిందన్నారు.రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా తన బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పారు.