సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బందికి శిక్షణ

సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బందికి శిక్షణ

రామచంద్రాపురం, వెలుగు: అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ప్రమాద స్థలాల నుంచి రక్షించేలా ఫైర్ సిబ్బందికి బీహెచ్ఈఎల్, సీఐఎస్ఎఫ్ బుధవారం ట్రైనింగ్ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం హైదరాబాద్లోని ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో బీహెచ్ ఈఎల్ సీఐఎస్ఎఫ్ కమాండెంట్ మంజీత్ కుమార్ దాదాపు 380 మంది ఫైర్ సిబ్బందికి ప్రత్యేక ట్రైనింగ్ అందించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో ఏ ప్రాంతంలోనైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఈ శిక్షణ పొందిన సిబ్బంది చేరుకుంటుందన్నారు. ప్రత్యేక అగ్నిమాపక పద్ధతులు, ప్రమాద స్థలాలను సురక్షిత ప్రాంతాలుగా మార్చే శిక్షణను వారికి ఇచ్చామన్నారు. 150 నగరాల నుంచి వచ్చిన ఫైర్ సిబ్బందికి మరికొ న్ని రోజులు శిక్షణ కొనసాగుతుందని వివరించారు.