
తెలంగాణ DCCB బ్యాంక్ లో భారీ కుంభకోణం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బేల DCCB బ్రాంచిలో రూ. 2కోట్ల 86 లక్షల నగదును దారి మళ్లించారు. డీసీసీబీ బ్రాంచ్ నుండి బేల, డోప్టాల సహకార సంఘాలకు రు.2.86 కోట్లు మంజూరు చూపెట్టారు డీసీసీబీ బ్రాంచ్ అధికారులు. అయితే డబ్బులు సంఘాల ఖాతాల్లో వేయకుండా సొంత ఎకౌంట్ కి మళ్ళించారు. బ్యాంక్ ఆడిట్లో ఈ బండారం కాస్త బయటపడింది. దీంతో బేల DCCB బ్యాంక్ అధికారులు డబ్బులు దుర్వినియోగానికి పాలు పడినట్లు రుజువు అయ్యింది. నలుగురు అసిస్టెంట్ మేనేజర్లు,11మంది సిబ్బంది పాత్ర ఉన్నట్టు సమాచారం.
ఇప్పటికే పలువురిని సస్పెండ్ చేస్తూ శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. రైతుల ఆకౌంట్ లలో ఉన్న డబ్బులకు ఎలాంటి ఇబ్బంది ఇబ్బంది లేదన్నారు. ఈ ఘటనపై ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం సీఐడీ విచారణ కోరామన్నారు DCCB సీఈఓ శ్రీధర్ రెడ్డి. రూ.2 కోట్ల 86లక్షల 40వేలు దుర్వినియోగమయ్యాయని ఆయన తెలిపారు. 11మంది సిబ్బందిపై వేటు వేశామన్నారు. నిందితులు వారి అకౌంట్లతో పాటు బంధువుల అకౌంట్లకి నగదు బదిలీ చేశారని పేర్కొన్నారు. రైతులు, ఖాతాదారులు ఆందోళన చెందవద్దన్నారు. ఇప్పటివరకు రూ.50 లక్షలు అకౌంట్ల ఫ్రీజింగ్ ద్వారా రికవరీ చేశామన్నారు.
ఇవి కూడా చదవండి:
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్
కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనను బుల్డోజర్లతో తొక్కిస్తాం