నితీశ్ కుమార్కు తృటిలో తప్పిన ప్రమాదం

 నితీశ్ కుమార్కు తృటిలో తప్పిన ప్రమాదం

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న పడవ.. గంగానదిలో నిర్మాణంలో ఉన్న జేపీ సేతు బ్రిడ్జ్ పిల్లర్ ను ఢీకొట్టింది. గంగానదిలో ఉన్న ఛత్ పూజా ఘాట్లను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు. పడవకు చిన్న డ్యామేజ్ కావడంతో మరొక పడవలోకి వెళ్లి ఆయన ఒడ్డుకు చేరుకున్నారు.  ఈ సమయంలో పడవలో సీఎం సహా పలువురు అధికారులు కూడా ఉన్నారు. 


కాగా, ఏటా దీపావళికి ముందు ఛట్ పూజలు చేస్తున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు పెద్దఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడ భక్తులు నీళ్ళలో నిలబడి సూర్య నమస్కారాలు చేస్తుంటారు. అక్టోబర్ 30న ఛట్ పూజలు ప్రారంభం కానున్నాయి.