ఇంత దుర్మార్గం ఏంట్రా : రీల్స్ చేయొద్దన్నందుకు భర్తను చంపిన భార్య

ఇంత దుర్మార్గం ఏంట్రా : రీల్స్ చేయొద్దన్నందుకు భర్తను చంపిన భార్య

బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయొద్దు అన్నందుకు ఓ మహిళ తన భర్తను హతమార్చింది. ఆ మహిళ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం వీడియోలు తీస్తుండగా చూసిన భర్త.. ఆమెను రీల్స్ చేయకుండా చేశాడు. దీంతో భర్తపై కోపోద్రిక్తురాలైన ఆ మహిళ అత్తమామలతో కలిసి అతన్ని హత్య చేసింది. ఈ సంఘటన జనవరి 7న రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగింది.

ఈ ఘటన ఖోడాబంద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫఫౌట్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడు సమస్తిపూర్ జిల్లాలోని నర్హన్ గ్రామ నివాసి మహేశ్వర్ కుమార్ రేగా గుర్తించారు. మహేశ్వర్ కోల్‌కతాలో కూలీ పని చేస్తూ కొద్ది రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. అతని భార్య రాణి కుమారి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేసేది.

ఫఫౌట్ గ్రామానికి చెందిన రాణి కుమారి 7 సంవత్సరాల క్రితమే మహేశ్వర్‌ను వివాహం చేసుకుంది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ విషయంలో అతడికి, అతడి భార్యకు మధ్య వాగ్వాదం జరగడంతో మహిళ, అత్తమామలు కలిసి మహేశ్వర్‌ను గొంతు కోసి హత్య చేశారు. కోల్‌కతా నుంచి మృతుడి సోదరుడు ఫోన్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, మృత దేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహేశ్వర్ బంధువుల ఫిర్యాదు మేరకు మృతుడి భార్యను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ పూర్తయిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.