భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్లోని బీజాపూర్జిల్లా నేషనల్పార్కు లో ఈనెల 11న జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టులను గుర్తించారు. గురువారం బీజాపూర్ఎస్పీ జితేంద్ర కుమార్యాదవ్వివరాలు తెలిపారు. మృతులు మద్దేడు ఏరియా కమిటీ కార్యదర్శి కన్నా అలియాస్బుచ్చన్న (రూ.8లక్షల రివార్డు), కమాండర్ఊర్మిళ (రూ.8లక్షల రివార్డు), ఏరియా కమిటీ మెంబర్ మోటూ అలియాస్జగత్తామో(రూ.5లక్షల రివార్డు), సభ్యులు దేవే, భగత్, మంగళి ఓయాం (రూ.2లక్షల చొప్పున రివార్డు)లుగా గుర్తించారు. ఘటనా ప్రాంతంలో 2 ఇన్సాస్లు, 9 ఎంఎం కార్బన్, 303 రైఫిల్, మందు పాతరలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
