భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్ర శాసనసభ స్పీకర్గా బీజూ జనతా దళ్ ఎమ్మెల్యే బిక్రం కేశరి అరుఖా సోమవారం (జూన్ 13న) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన స్పీకర్ బిక్రం కేశరికి సీఎం నవీన్ పట్నాయక్, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. అనారోగ్య కారణాలతో ఎస్ఎన్ పాత్రో స్పీకర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పాత్రో స్థానంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బిక్రంను స్పీకర్గా నియమించారు.
బిక్రం కేశరి అరుఖా 1995 నుంచి భంజానగర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర శాసనసభలో బీజేడీ ఎమ్మెల్యేలు 114 మంది, బీజేపీ ఎమ్మెల్యేలు 22 మంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 9 మంది, సీపీఐ(ఎం) నుంచి ఒకరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు.