రాపిడోకు 180 మిలియన్​ డాలర్ల ఫండింగ్

రాపిడోకు 180 మిలియన్​ డాలర్ల ఫండింగ్

న్యూఢిల్లీ: కొత్త ఇన్వెస్టర్ స్విగ్గీ నాయకత్వంలో సిరీస్ డీ రౌండ్ ఫండింగ్ ద్వారా​ 180 మిలియన్ డాలర్లు (రూ. 1,370 కోట్లకు పైగా) సేకరించినట్లు బైక్ టాక్సీ ప్లాట్​ఫారమ్​ ర్యాపిడో శుక్రవారం తెలిపింది.    టీవీఎస్ మోటార్ కంపెనీతోపాటు పాత పెట్టుబడిదారులు వెస్ట్​బ్రిడ్జ్, షెల్ వెంచర్స్,  నెక్సస్ వెంచర్స్ నుండి కూడా పెట్టుబడులు వచ్చాయని కంపెనీ తెలిపింది. టెక్నాలజీని పెంచడం, టీమ్స్​ను బలోపేతం చేయడం వంటి పనులకు ఈ డబ్బును వాడతారు. బైక్​ట్యాక్సీ, ఆటో, డెలివరీ కేటగిరీల డెవెలప్​మెంట్​కు భారీగా ఖర్చు చేస్తామని వెల్లడించింది. వంద సిటీల్లోని తమ పార్ట్​నర్ల ఆదాయాలు పెంచేలా చేస్తామని ప్రకటించింది. ర్యాపిడో గతంలోనూ పలువురు ఇన్వెస్టర్ల నుంచి 130 మిలియన్​ డాలర్లు సేకరించింది. దీనికి 15 లక్షల మంది డ్రైవర్లు, 2.5 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు.