ఓయూ, వెలుగు : బైక్చోరీలకు పాల్పడుతున్న తల్లి, తండ్రి, కొడుకును ఓయూ పోలీసులు అరెస్ట్చేశారు. వారి నుంచి ఆరు బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ జగన్తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ గోకుల్ నగర్ కు చెందిన అబ్దుల్ సమద్(41) ఫాస్ట్ఫుడ్సెంటర్తోపాటు స్క్రాప్బిజినెస్చేస్తున్నాడు. ఇతను గతంలో బైక్దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లివచ్చాడు. జల్సాల అలవాటు పడి భార్యను వదిలేశాడు. తర్వాత గోకుల్నగర్కు చెందిన సాహెరా(30) అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఒక కొడుకు(మైనర్) ఉన్నాడు.
అబ్దుల్సమద్భార్య, కొడుకుతోపాటు కొడుకు ఫ్రెండ్తో కలిసి గ్యాంగ్గా ఏర్పడి బైక్లు చోరీ చేయడం ప్రారంభించారు. మైనర్లు ఇద్దరూ కొట్టేసి తీసుకొచ్చిన బైకులను సమద్, సాహెర విక్రయిస్తున్నారు. గత నెల 21న ఓయూ మాణికేశ్వరీనగర్ మసీదు వద్ద పార్క్చేసిన బైక్ను కొట్టేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు మైనర్లను అరెస్టు చేశారు. వారి సమాచారంతో సమద్, సాహెరాను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. ఇప్పటివరకు 11 బైక్లను చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు.
వారి నుంచి ఆరు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ జగన్వెల్లడించారు. మరో కేసులో దువ్వల లాజరు అలియాస్రాము(19), కోనేటి రాజేశ్(19) ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్చేశారు. వీరిద్దరూ జల్సాల కోసం బైక్దొంగతనాలు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో రాము, రాజేశ్ను ఓయూ పోలీసులు అరెస్ట్చేశారు. రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
