పోచంపల్లి కి రూ. 14 కోట్లు రిలీజ్ చేయండి : ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి

పోచంపల్లి కి రూ. 14 కోట్లు రిలీజ్ చేయండి : ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి

యాదాద్రి, వెలుగు: పోచంపల్లి హ్యాండ్లూమ్​ పార్క్​ పునరుద్ధరణకు రూ.14 కోట్లు విడుదల చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్​సింగ్​కు వినతిపత్రం అందించారు. పోచంపల్లి ఇక్కత్​ హ్యాడ్యూమ్​ డెవలప్మెంట్​ స్కీమ్​ కింద ఈ నిధులు విడుదల చేయాలని కోరారు. బ్యాంకు రుణాలు పేరుకొనిపోయి హ్యాండ్లూమ్​పార్క్​ వేలానికి వెళ్లిందన్నారు.

 ఈ పార్కును తిరిగి కొనుగోలు చేసి పునరుద్ధరించేందుకు తెలంగాణ సర్కారు కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి బకాయిగా ఉన్న నిధులు విడుదల చేయాలన్నారు. పోచంపల్లి వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉందని, ఈ నిధులు విడుదల చేస్తే పార్క్​ పునరుద్ధరణతో చేనేత కార్మికులకు మరింత ఉపాధి కలుగుతుందని ఎంపీ తెలిపారు.