
సమాచార కమిషనర్ బిమాల్ జుల్కాను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్(CIC) గా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సమాచార కమిషన్లో CIC గా జుల్కాతో రామ్నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. జనవరి 11న చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సుధీర్ భార్గవ రిటైర్డ్ అయ్యారు. అప్పటి నుండి సమాచార శాఖ… చీఫ్ లేకుండానే పనులు చేపడుతోంది. ఇందులో మొత్తం 11 మంది కమిషనర్లు ఉండాల్సిఉంది. ప్రస్తుతం ఆరుగురు మాత్రమే ఉన్నారు. జుల్కా నియామకంతో మరో ఐదు సమాచార కమిషన్ల పోస్టులు భర్తీ కావాల్సి ఉంది.