- బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: గిరిజన వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా గిరిజనులందరినీ ఏకం చేసిన గొప్ప పోరాటయోధుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. బిర్సా జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన పోరాటాలను గుర్తించిన ప్రధాని మోడీ నవంబర్ 15 న జన జాతీయ గౌరవ్ దివస్ గా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. బిర్సా ముండా బ్రిటిష్ పాలకులపై తిరుగుబావుటా ఎగురవేసి తన జాతిని ఏకం చేశారని సంజయ్ గుర్తు చేశారు.
బీజేపీ స్టేట్ ఆఫీసులో బిర్సా ముండా జయంతి
బిర్సా ముండా జయంతిని మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో నిర్వహించారు. మాజీ మంత్రి రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. బిర్సా ముండా.. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన తీరును వారు గుర్తు చేసుకున్నారు. ఆయన త్యాగాలను స్మరించుకున్నరు.