సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నిరంకుశ వైఖరి వల్లే బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్. రాజయ్య ఆరోపించారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు శుక్రవారం నియోజకవర్గం నుంచి హైదరాబాద్ గాంధీభవన్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా లీడర్ల కాన్వాయ్ ను రాజమల్లు కాంగ్రెస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గెలుపు కోసం తాము ఎంతగానో కృషి చేసినప్పటికీ పార్టీలో సముచిత స్థానం కల్పించలేదన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసి పార్టీ విజయం కోసం పాటుపడ్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయరమణారావుతోపాటు మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మనోహర్రెడ్డి నిరంకుశ వైఖరి వల్లే బీఆర్ఎస్ వీడుతున్నం
- కరీంనగర్
- August 5, 2023
లేటెస్ట్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- Telangana Polling : పెద్దపల్లిలో 2 గంటల్లో 10 శాతం ఓటింగ్
- హైదరాబాద్లో ఓటేసిన సెలబ్రిటీలు
- రష్యాలో అపార్ట్మెంట్ బిల్డింగ్ కూలి.. 13 మంది మృతి
- Andhra Polling : మంగళగిరిలో ఓటు వేసిన పవన్, అతని భార్య
- న్యూక్లియర్ బాంబు తయారీకి వెనుకాడం.. ఇజ్రాయెల్కు ఇరాన్ వార్నింగ్
- 29వసారి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన కామి
- ఎలక్షన్ అబ్జర్వర్గా బీఆర్ఎస్ నేత
- పసి పిల్లలతో ఎన్నికల విధులకు హాజరైన ఆశా వర్కర్లు
- గ్రేటర్ హైదరాబాద్లో 1, 642 కేంద్రాలు సమస్యాత్మకం
Most Read News
- కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం
- ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్
- ముంభై హైకోర్టు సంచలన తీర్పు: ఫేక్ సర్టిఫికేట్తో చదివితేనేం.. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- అలర్ట్.. హైదరాబాద్లో మరో 12 గంటలు వైన్ షాపులు బంద్
- ఎండు కారంతో బీపీ, క్యాన్సర్, గుండెపోటుకు చెక్ పెట్టొచ్చట.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?
- రూ. 7 లక్షల రేంజ్ లో 25 కి.మీ. మైలేజ్ అందించే కార్లు
- తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ హెచ్చరిక .. పోలింగ్ రోజు ఆగమాగమే..