బిట్​ బ్యాంక్​ : హైదరాబాద్​లో ఆర్యసమాజ్​

బిట్​ బ్యాంక్​ : హైదరాబాద్​లో ఆర్యసమాజ్​
  •     హైదరాబాద్​ సంస్థానంలోని బీడ్​ జిల్లా ధరూర్​ గ్రామంలో 1892లో మొదటి ఆర్య సమాజ్​ సంస్థ ఏర్పాటైంది. 
  •     హైదరాబాద్​లో ఆర్యసమాజ్​ 1905లో సొంత భవనాన్ని సమకూర్చుకుంది. 
  •     హిందూ ధర్మరక్షణ కోసం ఆర్యసమాజ్​కు పోటీగా హైదరాబాద్​లో సనాతన ధర్మ మహామండల్​ను స్థాపించారు. 
  •     నిజాం ప్రభుత్వం ఆర్య సమాజ్​ ప్రచారకులైన పండిత్​ బాలకృష్ణశర్మ, నిత్యానంద బ్రహ్మచారిలను దేశం నుంచి బహిష్కరించారు.
  •     1896లో ఆర్య సమాజ్​కు హైదరాబాద్​లో కేశవరావు కోరాట్కర్​ నాయకత్వం వహించారు. 
  •     హైదరాబాద్​లో గణేశ్​ ఉత్సవాలు, సమితులను మరాఠీ మాట్లాడేవారు ప్రారంభించారు.
  •     కేశవరావు కోరాట్కర్​ హైదరాబాద్​ ఆర్య 
  • సమాజానికి 1932 వరకు అధ్యక్షులుగా 
  • కొనసాగారు. 
  •     ఆర్యసమాజ్​ పవిత్ర గ్రంథమైన సత్యార్థ ప్రకాశ్​ తెలుగులోకి 1921లో అనువదించారు. 
  •     తాను లింగాయత మత స్థాపకుడైన చిన్న బసవేశ్వరుని అవతారంగా ప్రకటించుకుని, ఆ తత్వాన్ని ఇప్పటి ఇస్లాంగా అభివర్ణించి హిందువులను ఇస్లాం మతం తీసుకోవాల్సిందిగా 1929లో సిద్ధిక్​ దీన్​దార్​ ప్రచారం ప్రారంభించింది. 
  •     1930లో హిందూ వితంతువుల హక్కుల కోసం పోరాడి చట్టం రావడానికి పండిత్​ కేశవరావు కృషి చేశారు. 
  •     ఆర్యసమాజ్​కు చెందిన కేంద్ర ప్రతినిధి సభ 1930లో మహాత్మా నారాయణ స్వామి మార్గదర్శకత్వంలో ఏర్పడింది. 
  •     1932 మే 21న పుణెలో పండిత్​ కేశవరావు మరణించిన తర్వాత ఆర్య సమాజ్​కు పండిత్​ వినాయక్​రావు విద్యాలంకార్​ అధ్యక్షుడు అయ్యారు. 
  •     1934లో ఆర్యసమాజ్​ హైదరాబాద్​లో వేదిక్​ ఆదర్శ్​ అనే ఉర్దూ పత్రికను ప్రారంభించారు. 
  •     ఆర్యసమాజ్​ 1934లో ప్రారంభించిన ఉర్దూ పత్రిక వేదిక్​ ఆదర్శ్​ హైదరాబాద్​ ప్రభుత్వం 1935లో నిషేధించింది. 
  •     ఇస్లాం మతం స్వీకరించనందుకు గంజోటిలో ఆర్య సమాజ్​ కార్యకర్త వేద ప్రకాశ్​ను హత్య చేశారు. 
  •     ఆర్య సమాజ్​ హవన కుండాలు ఏర్పరచరాదని ఆజ్ఞాపించిన నేపథ్యంలో 1938 ఏప్రిల్​ 16న హైదరాబాద్​లోని ధూల్​పేటలో తీవ్రమైన మతఘర్షణలు చెలరేగాయి. 
  •     ఆర్యసమాజ్​పై జరుగుతున్న పోలీసు అఘాయిత్యాలకు నిరసనగా దేవీలాల్​ సత్యాగ్రహం ప్రారంభించారు. 
  •     1938 మత ఘర్షణల అనంతరం హైదరాబాద్​లో ఆర్యసమాజ్​ కార్యక్రమాల నాయకునిగా నారాయణస్వామి బాధ్యతలు స్వీకరించారు. 
  •     ఆర్య సమాజ్​ నాయకుడు మహాత్మ నారాయణస్వామిని హైదరాబాద్​లో ప్రవేశంపై 1939 జనవరి 31న ప్రభుత్వం నిషేధం విధించింది. 
  •     మహాత్మా నారాయణ స్వామిని హైదరాబాద్​లోకి అనుమతించనందుకు నిరసనగా చేపట్టిన సత్యాగ్రహాన్ని ఆర్యసమాజ్​ కార్యకర్తలు 1939 ఆగస్టు 7న ఉపసంహరించుకున్నారు. 
  •     ఆర్యసమాజ్​ హైదరాబాద్​లో పండిట్​ కేశవరావు స్మారక పాఠశాలను 1940 జులై 20న ప్రారంభించారు. 
  •     1941లో ఆర్య ప్రతినిధి సభకు కార్యదర్శిగా పండిట్​ నరేందర్​ జీ బాధ్యతలు స్వీకరించారు. 
  •     ఆర్య సమాజ్​ను హైదరాబాద్​ ప్రభుత్వం విద్రోహ సంస్థగా పరిగణించిన కాలం 1942 నుంచి 1948 వరకు. 
  •     1942 మార్చి 3న ఊరేగింపుగా వెళ్తున్న ఆర్య సమాజ్​ కార్యకర్తలను ముస్లింలు అడ్డగించి, నలుగురిని తుపాకులతో కాల్చి చంపిన ఘటన హుస్నాబాద్​లో జరిగింది. 
  •     1943లో ఆర్యసమాజ్​ సమావేశంలో గణపతి కాశీనాథ శాస్త్రిని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. 
  •     ఆర్యసమాజ్​ మూడో సమావేశం రామ్​శరత్​ చంద్​జీ అధ్యక్షతన 1944లో నారాయణపేటలో జరిగింది. 
  •     1945లో ఆర్యసమాజ్​ ఆధ్వర్యంలో నల్లగొండలో ఉపదేశిక్​ విద్యాలయం స్థాపించారు. 
  •     ఆర్యసమాజ్​ నాలుగో సమావేశం 1945 ఏప్రిల్​లో గుల్బర్గాలో రాజ్​నారాయణ్​ లాల్​ పత్తి అధ్యక్షతన జరిగింది. 
  •     ఐదో ఆర్యసమాజ్​ సమావేశం 1946లో వరంగల్​ పట్టణంలో జరిగింది. 
  •     1946లో ఆర్యసమాజ్​ కార్యక్రమాలపై నిషేధం తొలగించి, జైళ్లలో మగ్గుతున్న కార్యకర్తలను నిజాం ప్రభుత్వ ప్రధాని మీర్జా ఇస్మాయిల్​ విడుదల చేశారు. 
  •     ఆర్యసమాజ్​ తరఫున ఆర్యాభాన్​ పత్రికను నడుపుకోవడానికి మీర్జా ఇస్మాయిల్​ అనుమతించారు. 
  •     ఆర్యసమాజ్​ ఆరో సమావేశం 1947లో జాల్నాలో గోవిందలాల్​ పిత్తి అధ్యక్షతన జరిగింది. 
  •     నిజాం వెళ్తున్న కారుపై చేతిగ్రెనేడ్​ విసిరి 20  సంవత్సరాల జైలుశిక్షకు గురైన ఆర్య సమాజ్​ కార్యకర్తలు నారాయణ్​ పవార్​, ఆయన అనుచరులు గండయ్య, జగదీష్​.
  •     భారత ప్రభుత్వం తరఫున హైదరాబాద్​ సంస్థానానికి దౌత్యవేత్తగా నియమించబడిన కె.ఎం.మున్షీకి రజాకార్ల వ్యూహాన్ని, ఆయుధ సమీకరణ రహస్యాలను చేరవేసి, హైదరాబాద్​ సంస్థానం భారతదేశంలో విలీనం చేయడానికి పరోక్షంగా సాయపడిన ఆర్యసమాజ్​ నాయకులు వందేమాతరం రామచంద్రరావు, ఆయన సోదరుడు వీరభద్రరావు.