కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ జిల్లా ఇన్చార్జి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలపై మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారన్నారు.
కామారెడ్డి పట్టణంలో అవినీతి రహిత పాలన అందించే విధంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ నీలం చిన్న రాజులు, ఆర్టీ టౌన్ ప్రెసిడెంట్ మోటూరి శ్రీకాంత్, నాయకులు మురళీధర్ గౌడ్, నరేందర్ రెడ్డి, విపుల్ తదితరులు పాల్గొన్నారు.
