అసదుద్దీన్​కు దమ్ముంటే ఇందూరులో ప్రచారం చేయాలి

అసదుద్దీన్​కు దమ్ముంటే ఇందూరులో ప్రచారం చేయాలి

నిజామాబాద్ ​అర్బన్, వెలుగు: ఎంఐఎం నేత అసదుద్దీన్​కు దమ్ముంటే ఇందూరులో ప్రచారం చేయాలని బీజేపీ అభ్యర్థి ధన్​పాల్​ సూర్యానారాయణ సవాలు విసిరారు. నిజామాబాద్​ అర్బన్​లో బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకే అక్కడ బరిలో నిలవలేదని వికారాబాద్​లో అసదుద్దీన్​  చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

పార్టీ జిల్లా ఆఫీస్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధన్​పాల్​ సూర్యనారాయణ మాట్లాడుతూ.. కార్పొరేషన్​ ఎన్నికల్లో మతాన్ని అడ్డుపెట్టుకొని 16 సీట్లు గెలిచిన ఎంఐఎం పార్టీ నేత ఇంతలా మాట్లాడితే, అందరి మద్దతుతో 28 సీట్లు గెలిచిన బీజేపీ ఏ స్థాయిలో మాట్లాడాలన్నారు. ఆర్ఎస్ఎస్, భజరంగ్​దళ్ లాంటి సంస్థలపై విష ప్రచారం చేస్తూ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని చూస్తున్న వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

అర్బన్ ​నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్​ అభ్యర్థి షబ్బీర్​అలీని ఓడించేందుకు ఇందూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో లీడర్లు లింగం, లక్ష్మీనారాయణ, స్రవంతిరెడ్డి, రాజు, లచ్చన్న పాల్గొన్నారు.