5 రాష్ట్రాల్లో గెలుపు మాదే బీజేపీ చీఫ్ నడ్డా

5 రాష్ట్రాల్లో గెలుపు మాదే బీజేపీ చీఫ్ నడ్డా

న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ప్రకటనను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతించారు. ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తామే ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ఆయన సోమవారం ట్వీట్ చేశారు. 

వచ్చే ఐదేండ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్, రాజస్థాన్, మిజోరం అసెంబ్లీలకు నవంబర్ 7 నుంచి వేర్వేరు తేదీల్లో ఈసీ ఎన్నికలను ప్రకటించింది.