బీజేపీ కమ్యూనిటీ సమావేశాల షెడ్యూల్ రిలీజ్

బీజేపీ కమ్యూనిటీ సమావేశాల షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో నేతలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తెలంగాణలోని వివిధ రాష్ట్రాల ప్రజలతో జాతీయ నేతలు కమ్యూనిటీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మీటింగుల షెడ్యూల్ ను పార్టీ హైకమాండ్ బుధవారం విడుదల చేసింది. జులై 1న హర్యానా వాళ్లతో జరిగే సమావేశంలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొంటారు. నేరేడ్​మెట్​లో తమిళులతో సమావేశానికి కుష్బు, అన్నామలై, మురుగన్.. రామ్ కోఠిలో గుజరాతీల సమావేశానికి సీఎం భూపేంద్ర పటేల్, విజయ్ రుపానీ.. కూకట్​పల్లిలో జరిగే మధ్యప్రదేశ్ వాసుల సమావేశానికి సీఎం శివరాజ్ సింగ్, రాజస్థాన్​ కమ్యూనిటీతో శంషాబాద్​లో ఎస్ఎస్ కన్వెన్షన్​లో జరిగే మీటింగ్​కు వసుంధర రాజె హాజరవుతారు. కర్నాటక సాహిత్య మందిర్​లో కన్నడ వాళ్లతో సీఎం బొమ్మై  హాజరవుతారు. హైటెక్ సిటీలో కాశ్మీర్ పండిట్లతో మీటింగ్ ఉంటుంది. మల్కాజ్​గిరిలో మలయాళీల సమావేశానికి మురళీధరన్,  కృష్ణదాస్ హాజరవుతారు.