రైతుల సంక్షేమానికి మోదీ సర్కార్ పెద్దపీట :  రితీశ్ రాథోడ్

రైతుల సంక్షేమానికి మోదీ సర్కార్ పెద్దపీట :  రితీశ్ రాథోడ్

ఖానాపూర్, వెలుగు: రైతుల సంక్షేమానికి మోదీ సర్కార్ పెద్దపీట వేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025–26 వానాకాలం సీజన్ 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధరలపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం ఖానాపూర్ పట్టణంలో నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చౌరస్తాలో మోదీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రితీశ్ మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల పట్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిందన్నారు. రైతుబంధు డబ్బులను సకాలంలో వేయడం లేదన్నారు. మోదీ సర్కార్ అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతోందని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, మండల, పట్టణ అధ్యక్షులు ఉపేందర్, మనోజ్, నాయకులు రవీందర్ రెడ్డి, రమేశ్, కిషన్ రెడ్డి తిరుమలగిరి, అనిల్ రావు, సంతోష్  తదితరులు పాల్గొన్నారు. 

ఆదిలాబాద్​లో..

ఆదిలాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ మద్దతు ధరలు పెంచడం పట్ల బీజేపీ కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సంబరాలు చేసుకున్నాన్నారు. ప్రధాని మోదీ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు దయాకర్, నాయకులు సదానందం, రవీందర్, విఠల్, కార్తీక్, రైతులు పాల్గొన్నారు.