బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం మేమే 

బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం మేమే 

సూరత్: బీజేపీకి తన పార్టీయే సరైన ప్రత్యామ్నాయమని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌‌లోని సూరత్‌‌‌లో రీసెంట్‌గా నిర్వహించిన లోకల్ బాడీ ఎన్నికల్లో ఆప్ 27 సీట్లు గెలవడంపై కేజ్రీ హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్ అభివృద్ధి కోసం బీజేపీ ఏమీ చేయట్లేదని, ఇక్కడ పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పతనావస్థలో ఉందని, ఆ పార్టీ పనైపోయిందన్నారు. బీజేపీకి దీటుగా ఎదుగుతున్న ఒకే ఒక పార్టీ ఆప్ అని.. సూరత్ ఎన్నికల్లో గెలుపు అందుకు నిదర్శమన్నారు.