- గోషామహల్లోనే రాజాసింగ్ గెలుపు
- అన్ని చోట్ల ఓటమి చెందిన పార్టీ అభ్యర్థులు
- ఈసారి పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్
హైదరాబాద్, వెలుగు: సిటీలో బీజేపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. పక్కాగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన స్థానాల్లోనూ చతికిలపడిపోయింది. 2018లో గోషామహల్లో రాజాసింగ్ మాత్రమే గెలుపొందారు. బల్దియా ఎన్నికల్లో సత్తాచాటిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకెళ్లలేకపోయింది. గతంతో పోలిస్తే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పటికీ సీట్లను మాత్రం సాధించలేకపోయింది.
అంబర్ పేటలో గతంతో పోలిస్తే చాలా వరకు ఓట్లు తగ్గాయి. 2018లో 2 వేలలోపు మెజార్టీతో బీజేపీపై బీఆర్ఎస్ గెలుపొందగా ఈసారి 24 వేల మెజార్టీతో బీజేపీపై బీఆర్ఎస్ గెలుపొందింది. మహేశ్వరం, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, ముషీరాబాద్, చార్మినార్, కార్వాన్, ఎల్బీనగర్, సనత్నగర్, కంటోన్మెంట్ స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, ముషీరాబాద్ ప్రాంతాల్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. సిటీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ ఆశలు నిరాశలు అయ్యాయి.