మిజోరంలో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

మిజోరంలో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

న్యూఢిల్లీ: నవంబర్​7న జరిగే మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 21 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొదలు12 మంది, తర్వాత 9 మంది అభ్యర్థుల లిస్ట్​ను పార్టీ హైకమాండ్​బుధవారం రిలీజ్ చేసింది. బీజేపీ స్టేట్​చీఫ్ గా ఉన్న​ వన్‌లాల్‌ముకా ఈసారి దంపా నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా, మిజోరాం అసెంబ్లీ మాజీ స్పీకర్ లాల్రిన్లియానా సైలోను పార్టీ మమిత్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. 40 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్​ ఇప్పటికే పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ 37.8 శాతం ఓట్లతో 26 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ ఐదు స్థానాలు, బీజేపీ ఒకస్థానం దక్కించుకున్నాయి.