
తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లుగా అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి జయకుమార్ వెల్లడించారు. ఇక నుంచి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదని స్పష్టం చేశారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై.. ద్రవిడ నేత అయిన అన్నాదురైపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని దీనిని తమ పార్టీ కార్యకర్తలు సహించలేకపోతున్నారని తెలిపారు.
- ALSO READ | సుప్రీంకోర్టులో ఝార్ఖండ్ సీఎంకు షాక్..
ఇక నుంచి అన్నామలై తమ పార్టీ నేతలను విమర్శిస్తే తీవ్ర పరిణామలను ఎదురుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమిళనాడు బీజేపీ చీఫ్గా అన్నామలై అనర్హుడంటూ జయకుమార్ కామెంట్స్ చేశారు. తమ పార్టీతో పొత్తు వల్లే బీజేపీకి తమిళనాడులో ఆ మాత్రం గుర్తింపు వచ్చిందని జయకుమార్ వ్యాఖ్యానించారు