మార్చిలో బండి సంజయ్ ఆరోవిడత పాదయాత్ర..!

మార్చిలో బండి సంజయ్ ఆరోవిడత పాదయాత్ర..!

రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేసేందుకు పార్టీ సీనియర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు ఇంఛార్జ్‭లుగా సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ వద్ద రాష్ట్ర నాయకత్వం ప్రపోజల్ పెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో ప్రజల్లో ఉండాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు విడతల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేశారు. ఇప్పటికే ఐదు విడతలు పూర్తయ్యాయి. దీంతో ఆరో విడత పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 16 నుంచి బండి సంజయ్ ఆరోవిడత పాదయాత్ర  ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఐదు విడతల్లో 50పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్రను పూర్తి చేశారు.