ప్రపంచ దేశాల్లో భారత్ గౌరవం పెరిగింది

ప్రపంచ దేశాల్లో భారత్ గౌరవం పెరిగింది
  • రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్

పూణె (మహారాష్ట్ర): బీజేపీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. కాంగ్రెస్ సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించినా పేదరికం, నిరుద్యోగం లాంటి సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. మోడీ వచ్చాక ఒక్కొక్కటి సమస్యలు కొలిక్కి వస్తున్నాయన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ కు గౌరవం పెరిగిందన్నారు. బయటి దేశాల నుంచి రక్షణ ఆయుధాల కొనుగోలు తగ్గాయన్నారు. మహారాష్ట్రలోని పూణెలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు రాజ్ నాథ్ సింగ్. అలాగే పూణేలోని డాక్టర్ డివై పాటిల్ విద్యాపీఠ్ విద్యార్థుల 13వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు.


కొత్త టెక్నాలజీ రూపొందించి ఆవిష్కరించాలి
‘ఆత్మనిర్భర్ భారత్’ సాధించేందుకు యువత కొత్త టెక్నాలజీలను రూపొందించాలని, ఆవిష్కరిం చాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. భారతదేశం తన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండాలని భావిస్తున్నామని..  దేశీయ రక్షణ కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఏ దేశానికైనా యువతే అతిపెద్ద బలం, ఉత్ప్రేరకం మాత్రమే కాదు మార్పునకు మూలం అని ఆయన అభివర్ణించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని దానిని అవకాశంగా మార్చుకునే సత్తా యువతకు ఉంది. వారు కొత్త టెక్నాలజీలను కనుగొని, కొత్త కంపెనీలు & పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయగల సామర్థ్యాన్ని మన యువత కలిగి ఉన్నారని అన్నారు. యువతపై తమ ప్రభుత్వానికి చాలా నమ్మకం ఉందని, అందుకే యువత పురోగతితో పాటు దేశ సమగ్రాభివృద్ధికి భరోసా కల్పించడానికి యువతకు  పుష్కలమైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

ఆర్టికల్ 370 రద్దు చేసి రెండేళ్లయినా మార్పు లేదు

జ్ఞాన్వాపి మసీదు కేసు.. సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

కెనడా పార్లమెంటులో కన్నడలో ఎంపీ ప్రసంగం
జకార్తా బయలుదేరిన పురుషుల హాకీ టీం