నా పేరు ఉచ్చరించే అర్హత కూడా ఆ ఎమ్మెల్యేకు లేదు

నా  పేరు ఉచ్చరించే అర్హత కూడా ఆ ఎమ్మెల్యేకు లేదు

ఆంధోల్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై మండిపడ్డారు బీజేపీ నేత బాబూమోహన్ . ఎమ్మెల్యే చిల్లర మాటలు , వెకిలి మాటలు మానుకోవాలని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల‌ని హెచ్చ‌రించారు. తన పేరు ఉచ్ఛరించే అర్హత కూడా ఆ ఎమ్మెల్యేకు లేదన్నారు. క్రాంతి కిరణ్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. ఎవరి బలమెంతో ప్రజల్లో తేల్చుకుందామని సవాల్ చేశారు. ఆయన తెలుగు భాష కూడా సరిగా మాట్లాడలేరని ఎద్దేవా చేశారు. అరటిపండ్లు అమ్ముకునే వారి దగ్గర ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేస్తున్నారని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. భూకబ్జాలు చేసి‌న వారిని ప్రశ్నిస్తే తప్పేంటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ శిక్షణతోనే ఎమ్మెల్యేలు ఇలా తయారయ్యారని బాబూమోహన్ విమర్శించారు.