యాచారం, వెలుగు : కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల రూపురేఖలు మారాయని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. మహాజన్ సంపర్క్ అభియాన్ ప్రోగ్రామ్లో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్యగూడలో దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషాతో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన పాంప్లెంట్లను పంచారు. ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే కిసాన్ సమ్మాన్ నిధి, ఉచిత రేషన్తో పాటు శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్స్, నర్సరీలు, రోడ్డుకు ఇరువైపులా చెట్లు.. ఇలా ఎన్నో పనులు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవీందర్, నాయకులు పాల్గొన్నారు.