బీజేపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే చింతలకు కరోనా పాజిటివ్

బీజేపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే చింతలకు కరోనా పాజిటివ్

హైదరాబాద్: రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. పేద‌, ధ‌నిక, హోదా, అధికారం అనే భేదం​ లేకుండా చాలామంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కి కరోనా వైర‌స్ సోకింది. దీంతో జూబ్లీహిల్స్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందరికీ పాజిటివ్ తేలింది. చింతల రామచంద్రరెడ్డి భార్య, కుమారుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. లాక్‌డౌన్ టైంలో చింతల చాలామందికి ‌నిత్యావసరాలు పంపిణీ చేశారని తెలుస్తోంది. కాగా కరోనా పాజిటివ్‌గా తేలినా తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, ఏ ఆందోళన అక్కర్లేదని చింత‌ల తెలిపారు.