కాశీబుగ్గ, వెలుగు: తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు డిమాండ్ చేశారు. గురువారం వరంగల్ కాశీబుగ్గ అంబేద్కర్ సర్కిల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్తో కలిసి సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
