ఫ్రీ అండ్ ఫెయిర్గా మునుగోడు ఉపఎన్నికను నిర్వహించాలె

 ఫ్రీ అండ్ ఫెయిర్గా మునుగోడు ఉపఎన్నికను నిర్వహించాలె

బీజేపీ నేతలపై అక్రమకేసులు పెడుతున్నారని.. బీజేపీలో చేరిన వారిని కూడా భయపెడుతున్నారని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. కేంద్రం దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలకు నియమించినట్లు మునుగోడుకు కూడా ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు. మునుగోడులో మద్యం ఏరులై పారుతుందని.. అంబులెన్స్ వాహనాలను కూడా చెక్ చేయాలన్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఉపఎన్నిక జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం కొత్త ఓటర్ నమోదుకు అవకాశం లేదని.. ఎలక్షన్ నోటిఫికేషన్కు వారం రోజుల ముందు నుంచే ఓటర్ నమోదుకు అనుమతి ఉండదని ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఈ నెల 8న ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇస్తామని చెప్పారన్న ఆయన.. గతంలో ఉన్న ఓటర్ల వివరాలను ఆర్టీఐ  ద్వారా సేకరించినట్లు తెలిపారు. ఒకవేళ ఓటర్ లిస్ట్లో తేడాలు ఉంటే ఎంతవరకైనా వెళ్తామని స్పష్టం చేశారు.