టిక్కెట్ రాలేద‌న్న మ‌న‌స్థాపంతో బీజేపీ నాయ‌కురాలు ఆత్మహ‌త్యాయ‌త్నం

టిక్కెట్ రాలేద‌న్న మ‌న‌స్థాపంతో బీజేపీ నాయ‌కురాలు ఆత్మహ‌త్యాయ‌త్నం

హైదరాబాద్‌లో ఓ బీజేపీ నాయకురాలు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల కసరత్తు మొదలైన వేళ ఎంతో మంది నాయకులు తమ తమ కుటుంబ సభ్యులను బరిలోకి దించుతున్నారు. ఈ నేపథ్యంలోనే నాచారంలో అశ్వత్థామ రెడ్డి భార్య విజయలత రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో కూడా బీజేపీ నుండి పోటీ చేసిన విజయలత రెడ్డి ఇప్పుడు కూడా అదే పార్టీ నుంచి టికెట్ ఆశించారు.కానీ, టికెట్ రాలేదు. తనకు టిక్కెట్ ఇవ్వకుండా ఇతరులకు కేటాయించారని, తమని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మోసం చేశారని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో విజయలత రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.